Friday, September 11, 2020

శంఖపుష్పం

ఈ మొక్క పెరటిలో వుంటే చాలు వైద్యుడితో అవసరముండదు!!
ఈ మొక్క అందరికి తెలుసు... కానీ ఈ మొక్కలో ఉన్న రహస్యం ఎవరికి తెలియదుఫాబేసి కుటుంబానికి చెందిన శంఖ పుష్పం పాకే తీగ జాతికి చెందినది. ఈ మొక్క గుబురుగా పెరుగుతుంది. ఈ మొక్క ఆసియా ఖండానికి చెందినది అయినా ఆ తర్వాత ప్రపంచం మొత్తం విస్తరించింది. ఈ పువ్వులు నీలి రంగు,తెలుపు రంగులో ఉంటాయి.
శంఖపుష్పం Clitoria ternatea; సంస్కృతం: श्वेतां, विष्णूक्रांता పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ఎగబ్రాకే మొక్క. వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు.విష్ణుక్రాంత పత్రి విష్ణుక్రాంత వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదవది.

 శంఖు పువ్వులను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం పెంచుకొనే మొక్కగానే మనలో చాలా మందికి తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. శంఖు మొక్కను ఎక్కువగా ఫుడ్ కలర్ గాను,టీగాను ఎక్కువగా ఉపయోగించటం వలన బాగా పాపులర్ అయింది. శంఖు మొక్క పువ్వులే కాకుండా
వేరు,కాండం,ఆకులు ఇలా మొక్కలో అన్ని భాగాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.
శంఖు పూలు, ఆకులు,వేళ్ళతో చేసిన పొడి జ్ఞాపకశక్తిని పెంచటంతో పాటు వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ నుండి కూడా రక్షిస్తుంది.
అంతేకాకుండా నిద్రలేమి,డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా మంచి ముందుగా పనిచేస్తుంది. మన పూర్వికులు ఈ శంఖు మొక్కను బాగా వాడి ఈ ప్రయోజనాలను పొందేవారు. ఏఈ మధ్య జరిగిన పరిశోధనల్లో కూడా ఈ విషయం నిరూపణ అయింది. శంఖు పువ్వుల్లో ఉండే ఆర్గనేల్లోలిన్ అనే పదార్ధం మెదడు పనితీరు మీద పనిచేసి మతిమరుపును తగ్గించటంలో సహాయపడుతుంది. శంఖు పువ్వులో ఉండే ప్రోయంతోసైనిడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా గ్లకోమా వంటి శాంతి సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే శంఖు పువ్వులో ఉండే క్యూయెర్సిటిన్ అనే ఫ్లవనాయిడ్ జుట్టు తొందరగా తెల్లపడకుండా చేస్తుంది. అలాగే చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది. అలాగే ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా సహాయం చేస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అయితే ఈ శంఖు పువ్వులను ఏ విధంగా తీసుకోవాలో తెల్సుకుందాం
పువ్వులను ఆకులను  నోటిలో వెసుకుని నమలచ్చు  లేదా అరలీటర్ నీటి లో ఓ పది పదిహేను పువ్వులను ఆకులను వేసి కాచి వడకట్టి కషాయరూపంలో లోపలకుతీసుకోవచ్చు
ఈ పువ్వును తరచూ ఆహారంగా తీసుకోవడం ద్వారా మానసిక ఆందోళన మాయమవుతుంది. ఈ వుండే పువ్వును థాయ్‌లాండ్, చైనా వంటి ఆసియా దేశాల్లోని స్టార్ హోటల్స్‌లో రాయల్ ఫుడ్స్‌లో చేరుస్తున్నారు. ఈ పువ్వును అక్కడ బటర్ ఫ్లై ఫ్లవర్ అని పిలుస్తారు.

మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయడంలో శంఖుపువ్వులు సూపర్‌గా పనిచేస్తాయి. నెలసరి సమస్యలు, సంతాన లేమి, యూరినల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే శంఖుపువ్వులను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

శంఖు పువ్వు శరీరంలోని ఆమ్లాన్ని తొలగించే యాంటీయాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. శ్వాస సంబంధిత రోగాలు, హృద్రోగాలన నయం చేస్తుంది. నీలపు శంఖు పువ్వుల చెట్టు ఆకులను రుబ్బి పసుపు కలిపి వాపు ఉన్న దగ్గర రాసుకుంటే వాపు తగ్గుతుంది.

శంఖు పుష్పాలను సంప్రదాయ మందుల్లో వాడుతారు. ఇది బ్రెయిన్‌కి టానిక్‌లా పనిచేసి… మెమరీ పవర్‌, తెలివితేటల్ని పెంచుతుంది. కళ్లు, గొంతులో సమస్యల్ని నివారిస్తుంది. చర్మం, మూత్ర సంబంధ వ్యాధుల్ని కూడా ఇది నయం చేస్తుంది. అలాగే ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా సహాయం చేస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

ఒత్తిడి, నీరసం, మతిమరపు, నిద్ర లేమి, కంటి చూపు సమస్యలు, జుట్టు రాలిపోవుట, చర్మం వదులుగా అవ్వుట వంటి సమస్యలు వస్తుంటే ఈ పూలను ఉపయోగించడం సరైన పరిష్కారం. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, పెప్టైడ్స్ మంచి ఫలితాల్ని ఇస్తున్నాయి.

పువ్వును లేదా ఆకును నోటిలో వేసుకొని నమలచ్చు. లేదా నీటిలో ఆకులు లేదా పువ్వులు లేదా శంఖు మొక్కలో ఏ బీగాన్ని అయినా నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని వడకట్టి త్రాగవచ్చు. నీలం రంగులో ఉండే ఈ శంఖు పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్ గా అనేక రకాల స్వీట్స్, కేకులు, ఐస్ క్రీమ్స్ వంటి వాటిల్లో వాడుకోవచ్చు.

నీలిరంగులో వుండే పుష్పాలు చూసేవుంటారు. ఈ నీలి రంగు పువ్వులు శనీశ్వరుడికి సమర్పిస్తే.. శనిదోష ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్య నిపుణులు అంటారు. అయితే ఈ పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నీలి రంగుతో కనిపించే ఈ పుష్పం మానసిక ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తుంది. ఈ నీలపు శంఖు పువ్వుల చెట్టు ఆకులతో పసుపుతో రుబ్బి.. లేపనంగా పూస్తేవాపు తగ్గుతుంది. 
 
మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయడంలో శంఖుపువ్వులు సూపర్‌గా పనిచేస్తాయి. నెలసరి సమస్యలు, సంతాన లేమి, యూరినల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే శంఖుపువ్వులను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఈ శంఖు రూపంలో వుండే పువ్వును థాయ్‌లాండ్, చైనా వంటి ఆసియా దేశాల్లోని స్టార్ హోటల్స్‌లో రాయల్ ఫుడ్స్‌లో చేరుస్తున్నాయి. ఈ పువ్వును అక్కడ బటర్ ఫ్లై ఫ్లవర్ (Butterfly Pea Flower) అని పిలుస్తున్నారు. ఈ పువ్వును మాసంలో రెండుసార్లు ఆహారంగా తీసుకోవడం ద్వారా మానసిక ఆందోళన మాయమవుతుంది. 
 
ఇది శరీరంలోని  ఆమ్లాన్ని తొలగించే యాంటీయాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. శ్వాస సంబంధిత రోగాలు, హృద్రోగాలన నయం చేస్తుంది. ఒక గ్లాసుడు నీటిలో ఐదు నీలపు శంఖుపువ్వులను వేసి పది నిమిషాల పాటు నాన బెట్టి.. ఆ నీటిని తేనెతో కలుపుకుని తాగితే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అయితే ఈ పానీయాన్ని మాసానికి ఒకసారి వినియోగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
శంఖపుష్పాల కోసం కొన్ని తోటలలో పెంచుతారు.
భూసారాన్ని పెంచడానికి కొన్ని ప్రాంతాలలో వాడుతారు.
శంఖపుష్పాలను వివిధ దేవతలకు జరిపే పుష్పపూజలో ఉపయోగిస్తారు.
దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు.
దీని వేరు విరేచనకారి, మూత్రము సాఫీగా వచ్చుటకు తోడ్పడును.
దీని విత్తనములు నరముల బలహీనతను పోగొట్టుటకు వాడెదరు.
ఆసియాలో దీని పుష్పాలను కొన్ని రకాల ఆహార పదార్ధాల వర్ణకంగా వాడుతున్నారు.

No comments:

Post a Comment